Friday, October 18, 2024

Srisailam | శ్రీశైలం ఈవో పెద్దిరాజు బదిలీ…

శ్రీశైలం దేవస్థానం ఈఓ డి.పెద్దిరాజ్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దిరాజుని మాతృసంస్థలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ)కి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ప్ర‌భుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అదేవిధంగా శ్రీశైలం ఇన్‌చార్జి ఈఓగా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన పెద్దిరాజు…. డిప్యూటేషన్‌పై ఏడాది నుంచి శ్రీశైలం దేవస్థానం ఈఓగా పనిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement