Tuesday, October 1, 2024

Tragedy స్కూల్ బ‌స్సులో మంట‌లు …. 25 మంది స‌జీవ ద‌హ‌నం

థాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. పాఠశాల విద్యార్థులు, వారి టీచర్ను తీసుకెళుతున్న ఓ బస్సు మంటల్లో చిక్కుకొంది. సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగివస్తుండగా జరిగిన ఈ ఘటనలో మొత్తం 25 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు విద్యార్ధులు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

“మొత్తం 44 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. వీరిలో 38 మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు ఉన్నారు. ఇప్పటివరకు 16 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లను రక్షించారు. మిగిలిన వారి విషయంపై ఇంకా స్పష్టత లేదు” అని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది..

- Advertisement -

ఇటీరియర్ మంత్రి అనుతిన్ చర్నవిరకుల్ మాట్లాడుతూ మృతుల సంఖ్యను ఇంకా ధ్రువీకరించలేమని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన వారి సంఖ్య ఆధారంగా.. 25 మంది చనిపోయి ఉండొచ్చన్నారు. థాయ్ల్యాండ్ ప్రధాని పేటోంగ్జార్న్ షినవత్రా మృతులకు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement