Thursday, October 24, 2024

TG | రేపు ఉద్యోగులకు తీపి కబురు చెబుతాం : రేవంత్

రాష్ట్రంలో పెండింగ్ డీఏలపై రేపు సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటించనున్నట్లు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీవో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. దాదాపు 3 గంటల పాటుజ‌రిగిన ఈ స‌మావేశంలో.. ఉద్యోగ సంఘాల జేఏసీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం స్పష్టం చేశారు.

ఈ క్ర‌మంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షుడిగా… మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా.. కె.కేశవరావు ప్రత్యేక ఆహ్వానితుడిగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీపావళి తర్వాత శాఖల వారీగా ఉద్యోగుల ప్రతినిధులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై చర్చిస్తుందని సీఎం అన్నారు. జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై… కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement