Tuesday, September 17, 2024

Delhi: ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి..

ఓ ట్ర‌క్కు ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లడంతో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు ఢిల్లీలోని శాస్త్రి పార్క్ సమీపంలో తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో సీలంపూర్ వైపు నుంచి ఓ భారీ ట్రక్కు వెళ్తోంది. ఈ క్రమంలోనే అతివేగంతో ట్రక్కు అదుపుతప్పి ఫుట్‌పాత్‌ నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని జగ్‌ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో జీటీబీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి.. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేప‌ట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement