Thursday, September 5, 2024

AP | తెరుచుకున్న తుంగభద్ర మూడు గేట్లు… దిగువకు 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల

కర్ణాటక ఎగువ భాగంలో కురిసిన వర్షాలకు తుంగభద్ర జలాశయం నిండుకుంది. దీంతో సోమవారం తుంగభద్ర జలాశయంకు చెందిన మూడు గేట్లు తెరిచి తుంగభద్ర నదిలోకి ఐదు వేల‌ క్యూసెక్కుల నీటిని సాయంత్రం నీటిని విడుదల చేశారు. జలాశయం ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుతం తుంగభద్ర జలాశయంకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం మూడు గేట్లు తెరిచి నీటిని విడుదల చేసిన అధికారులు రాత్రికి వీటిని మరింత పెంచే అవకాశం ఉంది. దాదాపు 50 వేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని తుంగభద్ర ఇంజనీర్లు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement