Tuesday, September 17, 2024

ఎస్సాఆర్సీలోకి దూసుకెళ్లిన కారు – ముగ్గురు దుర్మ‌ర‌ణం..

జ‌గిత్యాల : జ‌గిత్యాల జిల్లాలో సోమ‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు.. జ‌గిత్యాల నుంచి జోగిన‌ప‌ల్లికి వెళ్తున్న కారు మేడిప‌ల్లి వ‌ద్ద ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెంద‌గా, ఒక‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. జ‌గిత్యాల‌కు చెందిన ప్ర‌ముఖ న్యాయ‌వాది క‌ట్కూరి అమ‌రేంద్ర‌రావు త‌న భార్యా, కుమారుడు, కూతురుతో క‌లిసి జోగిన‌ప‌ల్లికి దైవ‌ద‌ర్శ‌నం కోసం బ‌య‌ల్దేరారు. తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో కారు ఎస్సారెస్పీ కాలువ‌లోకి దూసుకెళ్ల‌డంతో.. అమ‌రేంద్రావుతో పాటు భార్య శిరీష‌, కూతురు శ్రేయ గ‌ల్లంతు అయ్యారు. కుమారుడు జ‌యంత్ చాక‌చ‌క్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు క్రేన్ స‌హాయంతో కారును బ‌య‌ట‌కు లాగారు. అమ‌రేంద్ర‌రావుతో పాటు ఆయ‌న భార్య‌, కూతురు మృత‌దేహాల‌ను పోలీసులు బ‌య‌ట‌కు వెలికితీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement