Friday, September 20, 2024

Kedarnath: చిక్కుకున్న‌ తెలుగు యాత్రికులు క్షేమం…

కేదార్‌నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నారు. అధికారులు వారిని ఇవాళ‌ ఉదయం సురక్షిత ప్రాంతానికి తరలించారు. కొంతమంది యాత్రికులు కేదార్‌నాథ్‌లోనే చిక్కుకుపోయి, తాము ఆపదలో ఉన్నామని, కిందకు చేరుకోలేకపోతున్నట్లు ఆ భక్తులు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని సంప్రదించారు.

ఆయన వెంటనే ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి లోకేశ్ ఉత్తరాఖండ్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ అంశంపై చర్చించారు. అక్కడి అధికారులతో మాట్లాడి యాత్రికులు సురక్షితంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కొంతమంది యాత్రికులు గుప్తకాశీకి చేరుకున్నారు. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణం సహకరించకపోవడంతో 20 మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement