Friday, September 20, 2024

IND vs SL | రాణించిన శ్రీలంక బ్యాట‌ర్లు.. భార‌త్ టార్గెట్ ఎంతంటే !!

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఆతిథ్య శ్రీలంక బ్యాటింగ్‌లో చెలరేగిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. వికెట్లు పడిపోతున్న స్కోరుబోర్డును ప‌రుగులు పెట్టిస్తూ… క్రికెటర్లు భారీ పరుగులు చేశారు.

శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (40), కుసల్ మెండిస్ (30), కెప్టెన్ చరిత్ అసలంక (25), ఆల్ రౌండర్ దునిత్ వెల్లలాగే (39), కమిందు మెండిస్ (40) భారత బౌలర్లను ఎదుర్కొని భారీ పరుగులు చేశారు.

మరోవైపు భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (3/30), కుల్దీప్ యాదవ్ (2/33), అక్షర్ పటేల్ (1/38), మహ్మద్ సిరాజ్ (1/43) వికెట్లు తీశారు. దీంతో 241 పరుగుల భారీ లక్ష్యంతో భారత జట్టు ఛేజింగ్ ప్రారంభించనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement