Friday, September 20, 2024

Kaynes Technology | తెలంగాణ వదిలి వెళ్లమన్న కంపెనీ..

హైదరాబాద్ : తెలంగాణతోనే  కొనసాగుతామని సెమీకండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీ తేల్చి చెప్పింది. రాష్ట్రా భివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని సంస్థ సీఈవో రఘు ఫణికర్ స్పష్టం చేశారు. ఈ నెల 23న కొంగరకలాన్ లో కేన్స్ సంస్థ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ ను ప్రారంభించబోతున్నది.

ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రఘు ఫణికర్ (సోమవారం) సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న OSAT యూనిట్ ఇండియన్ సెమికండక్టర్ మిషన్ పరిశీలనలో ఉంది. ఐఎస్ఎం అనుమతి రాగానే ఓశాట్ యూనిట్ ఆపరేషన్స్  ప్రారంభిస్తామని  ఫణికర్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement