Saturday, June 29, 2024

NEET UG | నీట్ రీ ఎగ్జామ్ కి 750 మంది డుమ్మా ..

నీట్‌ పరీక్షల్లో అవకతవకలు జరగడంతో నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి ఆదివారం నీట్ రీటెస్ట్ నిర్వహించారు. వారిలో 48 శాతం మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఎన్టీఏ వెల్లడించింది.

1563 మంది విద్యార్థుల్లో 813 మంది (52 శాతం) పరీక్షకు హాజరైతే, 750 మంది (48 శాతం) గైర్హాజరయ్యారని ఎన్టీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, గుజరాత్, హరియాణాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పరిధిలో 7 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు రీటెస్ట్ నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement