Friday, September 20, 2024

TG | యాదాద్రి హుండీ ఆదాయం రూ.రెండు కోట్ల‌కుపైగానే !

ప్రభన్యూస్ /యాదగిరికొండ : యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆల‌యానికి భారీగా హుండీ ఆదాయం వ‌చ్చింది. శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి.. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు.

కాగా, ఈ రోజు (బుధవారం) కొండకింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు. ఈ సంద‌ర్భంగా స్వామివారి హుండీ ఆదాయం రూ.2,98,48,233లు వచ్చినట్లు చెప్పారు.

శ్రీ స్వామి వారి హుండీలో మిశ్రమ బంగారము- (205 గ్రాములు), మిశ్రమవెండి – (5.710గ్రాములు), అమెరికా – 1261 డాలర్లు, ఆస్ట్రేలియా 125 డాలర్లు, ఇంగ్లాండ్ – 65 పౌండ్స్, యూఏఈ – 210 దిరమ్స్, నేపాల్ – 730 రుపిస్, సౌదీ అరేబియన్ – 537 రియల్, సింగపూర్ – 60 డాలర్స్, కతర్ – 3 రియల్, ఒమన్ – 100 బైస, శ్రీలంక – 1000 రూపీస్, కెనడా – 60 డాలర్స్, యూరోప్ – 125 యూరో, థాయిలాండ్ – 20 భట్, రష్యా – 50 రూబెల్, ఒమన్ – 1 రియల్, మలేసియా – 22 రింగ్గిట్స్ వచ్చాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement