Thursday, September 19, 2024

TG | ‘హైడ్రా’ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి !

హైదరాబాద్ : చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా చట్టబద్దతను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైడ్రాకు ఉన్న అధికారాలను సవాలు చేస్తూ లక్ష్మి అనే మహిళ పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అమీన్‌పూర్‌లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా కూల్చి వేశారని తెలిపారు.

ఈక్రమంలో…. స్పష్టమైన ఉత్తర్వులు చూపించినా.. న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా.. అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా దూకుడు ప్రదర్శిస్తూ, కూల్చివేతలకు పాల్పడుతున్న హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారా? అంటూ హైడ్రాను ప్రశ్నించింది. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement