Saturday, October 5, 2024

UP | ఎన్నికల కోడ్ కేసులో జయప్రదకు ఊర‌ట‌..

ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులో మాజీ ఎంపీ, సినీనటి జయప్రదకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెను యూపీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రచార సమయంలో ప్రత్యర్థి ఆజం ఖాన్‌పై చేసిన వ్యాఖ్యల క్రమంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది.

దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం గురువారం ఆమెను నిర్దోషిగా ప్రకటించినట్లు సీనియర్‌ న్యాయవాది అమర్‌నాథ్‌ తివారీ వెల్లడించారు. న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించిన సమయంలో ఆమె కోర్టులోనే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement