Friday, September 20, 2024

TG | ఈ నెల 11న రాష్ట్రానికి కేంద్ర బృందం రాక…

న్యూఢిల్లీ : తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్ & కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 మంది సభ్యుల కేంద్ర బృందం ఈనెల 11న (బుధవారం) తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో సహా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనుంది.

ఈ బృందంలో కల్నల్ కెపి సింగ్‌తో పాటు ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుంది.

ఈ సందర్భంగా.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గారు కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ గారితో ఫోన్లో మాట్లాడి.. ఆదివారం నాటి తన ఖమ్మం పర్యటనలో తెలుసుకున్న అంశాలను, బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement