Friday, September 20, 2024

Breaking: లోయలో పడిన బస్సు… 14 మంది భార‌తీయులు దుర్మ‌ర‌ణం

నేపాల్‌లో జ‌రిగిన ఘోర‌ ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది భార‌తీయులు దుర్మ‌ర‌ణం చెందారు. పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు టనహూన్ జిల్లాలో మర్స్యంగడి నదిలోకి దూసుకెళ్లింది. బస్సు పోఖరా నుంచి కఠ్మాండు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బస్సుకు యూపీ నంబర్ ప్లేట్ ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో మరో 26 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement