Thursday, September 12, 2024

TG – నక్కల వాగులో గల్లంతైన కారోబార్ మృతి

కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : నక్కల వాగులో గల్లంతయిన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మిర్ఝంపేట గ్రామపంచాయతీ కారోబార్ చెప్పాల పవన్ మృతి చెందాడు. సింగరేణి ఎన్టీఆర్ బృందం నక్కల వాగులో పవన్ మృతదేహాన్ని వెలికి తీశారు.

కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన చెప్పాల పవన్ 22 మీర్జంపేట గ్రామపంచాయతీలో కారోబారుగా పనిచేస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకొని స్వగ్రామమైన కాల్వ శ్రీరాంపూర్ కు వస్తున్న సందర్భంగా మార్గమధ్యలో కొత్తపెళ్లి శివారులో నక్కల వాగు రోడ్డుపై పొంగి ప్రవహించడంతో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నీటిలో పడిపోయింది. పవన్ నక్కల వాగు లో కొట్టుకపోయి గల్లంతయ్యాడు.

పోలీసులు, రెవిన్యూ అధికారులు కాల్వ శ్రీరాంపూర్ కి చెందిన గ్రామస్తులు కొట్టుకపోయిన పవన్ కోసం గాలింపులు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో సింగరేణి ఎన్ డి ఆర్ రెస్క్యూ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. అర్ధరాత్రి తర్వాత నక్కల వాగులో పవన్ మృతదేహాన్ని వెలికి తీశారు. పవన్ మృతి తో కాల్వ శ్రీరాంపూర్ లో విషాదఛాయాలు అలుముకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement