Friday, September 20, 2024

TG – యూట్యూబ్ ఛానల్స్ – అక్రెడిటేషన్లు – 23న రౌండ్ టేబుల్ సమావేశం.

హైదరాబాద్ – రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడానికి విధివిధానాలు, అనుసరించాల్సిన నియమ నిబంధనలు సూచించడానికి , యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు, తదితర అంశాలపై చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఈ నెల 23న నిర్వహిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

‘’యూట్యూబ్ ఛానల్స్- అక్రెడిటేషన్లు ’’ అంశంపై మీడియా అకాడమీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ నెల 23న, బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో నిర్వహిస్తుంది. ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, నీష్ణాతులు ఈ సమావేశంలో పాల్గొని సంబంధిత విషయాలపై చర్చించి, జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడానికి సూచనలు చేస్తారని అకాడమీ చైర్మన్ చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement