Saturday, September 21, 2024

TG | చంద్రబాబుతో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ భేటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఏపీ సీఎం ఎన్‌ చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ భేటీ అయ్యారు. ఆదివారం జూబ్లీ హిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో వారి భేటీ జరిగింది. ఇరువురు నేతలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు జారీ చేసే లేఖలను ఆమోదించాలని స్పీకర్‌ కోరారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా చంద్రబాబుకు స్పీకర్‌ శాలువ కప్పి సత్కరించారు. అదే విధంగా చంద్రబాబు కూడా స్పీకర్‌ను గౌరవించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement