Friday, September 20, 2024

TG | రాష్ట్రంలో 20 నుంచి వర్షాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఈనెల 20 నుంచి 22 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, జగిత్యాల, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేసింది. ఇక సెప్టెంబర్‌ 21న రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్నగర్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తె లిపింది. అదేవిధంగా.. సెప్టెంబర్‌ 22న పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement