Saturday, July 6, 2024

TG | మంత్రివర్గ విస్తరణ లేనట్లే.. పీసీసీపై కుదరని ఏకాభిప్రాయం

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆషాడ మాసం ప్రారంభమవుతుండడంతో ఈనెల 4న లేదా 5న మంత్రివర్గ విస్తరణ తప్పకుండా ఉంటుందని అంతా భావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో భేటీ కావడం, బుధవారం ఢిల్లీ కి వెళ్లడంతో కచ్చితంగా గురువారం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆశవాహులు భావించారు.

అయితే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక లో ఏకాభిప్రాయం రాకపోవడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ వైపు మొగ్గు చూపగా అధిష్టాన పెద్దలు మధు యాష్కి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా పడడంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆశావాహులు నిరుత్సాహంతో బుధవారం రాత్రి హైదరాబాద్ బాట పట్టారు. మంత్రివర్గ విస్తరణ మరో వారం పది రోజులు పార్టీ అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement