Monday, September 16, 2024

TG | ఎంపాక్స్‌పై మంత్రి దామోదర సమీక్ష..

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంకీ పాక్స్‌పై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ, చెన్నైలలో మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయ‌ని… ఈ సందర్భంగా ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్షించారు. వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

తరచుగా ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయాలని… అవసరమైన మెడికల్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు తెలిపారు. గాంధీ ఆస్పత్రి, ఫీవర్‌ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement