Tuesday, July 2, 2024

TG| షాద్‌నగర్‌‌ కంపెనీలో భారీ పేలుడు.. ఆరుగురి దుర్మరణం

షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది . ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సౌత్ గ్లాస్ ప్రైవేట్ కంపెనీ ఫర్నేస్ విభాగంలో కంప్రెసర్ గ్లాస్ పేలడంతో మంటలు చెలరేగాయి.

మంటలు చెలరేగడంతో కార్మికులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఈ ప్ర‌మాదంలో గాయపడిన వారిలో పలువురి తలలు, కాళ్లపై గాయాలు గాయాలవ్వ‌గా… చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధిత కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారని పోలీసులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంనట్లు తెలిసింది. ఈ ఘటనపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement