Tuesday, September 17, 2024

TG | బాలకృష్ణా రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు

భువనగిరి, (ప్రభ న్యూస్) : అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డిని (ఆదివారం) మాజీ మంత్రి హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, ఫైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించారు.

బాలకృష్టా కు అందిస్తున్న చికిత్స వివరాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అలాగే జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కూడా హరీశ్ రావు మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement