తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా రేవంత్ సర్కార్ గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేసింది. డ్రగ్స్, గంజాయి వినియోగం, అక్రమ రవాణాను నిఘా పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగు, స్మగ్లింగ్పై సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతిని ప్రకటించింది. గంజాయిపై సమాచారం అందించిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది.
రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి వినియోగం, అక్రమ రవాణా జరిగినట్లు సమాచారం అందితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విజ్ఞప్తి చేశారు. 871267111 కాల్ లేదా [email protected]లో ఇ-మెయిల్ చేయాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి గురించి సమాచారం అందించిన వారికి రెండు లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని చెప్పారు.