Monday, July 8, 2024

TG – సింగరేణి బొగ్గు గనుల వేలం ర‌ద్దు చేయాలి … సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి

ఉమ్మడి కరీంనగర్, ప్రభ న్యూస్ బ్యూరో : సింగరేణి బొగ్గు గనుల వేలం రద్దు చేయాలని శుక్ర‌వారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వామ‌ప‌క్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్. ప్రజా పంథా, మాస్ లైన్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ధర్నా చేశారు. ధ‌ర్నానుద్దేశించి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ ను వేలం వేస్తే ఊరుకోమన్నారు. వెంటనే వేలం పాట రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి, మంద పవన్, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసు దేవ రెడ్డి, సీపీఐ ఎం ఎల్ ప్రజా పంథా మాస్ లైన్ జిల్లా నాయకుడు జిందం ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement