Friday, October 18, 2024

TG | 17న ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరో దఫా ఢిల్లీ పయనమవుతున్నారు. ఈ నెల 17న ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి హస్తిన వెళ్లనున్న సీఎం రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగే పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొననున్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో పార్టీ ఓటమికి దారి తీసిన పరిస్థితులు, జమ్మూకాశ్మీర్‌లో గెలుపునకు దోహదపడ్డ అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

హర్యానాలో పార్టీ గెలుపు తథ్యమని.. అధికారంలోకి రావడం పక్కా అని అన్ని సర్వే సంస్థలు, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయని, చివరికి బీజేపీ నేతలే ఓటమి అంచున ఉన్నామని చెబుతూ చివరి రోజుల్లో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని, అయినా ఆ పార్టీ విజయం సాధించడంపై అనేక అనుమానాలున్నాయని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement