Wednesday, October 23, 2024

TG | ఢిల్లీకి బ‌య‌ల్దేరిన సీఎం రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బ‌య‌ల్దేరారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కాంగ్రెస్ హైకమాండ్ తో కీల‌క చ‌ర్చ‌లు జ‌ర‌పనున్నారు. మంత్రిమండలి కూర్పుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మిగిలిన నామినేటెడ్ పదవుల పంపకం, కొత్త పీసీసీ చీఫ్‌తో పాటు పార్టీలో కీలక పదవుల నియామకంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో వారం రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణం ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement