Monday, September 16, 2024

TG | స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన

యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించి వారికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడమే లక్ష్యంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండ‌లం మీర ఖాన్ పేట్ లో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆరు కోర్సులతో ఈ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు.

కాగా, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు మరో 4 సెంటర్లకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టారు. సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని ప్రపంచంతో యువతతో పోటీ పడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. యుంగ్​ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బిల్లుపై చర్చలో మాట్లాడిన ముఖ్యమంత్రి విద్యార్థుల కోసం 17 కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు.

వృత్తి నైపుణ్యం లేకపోవడంతో పట్టాలు ఉన్నా ఉద్యోగాలు దొరకడం లేదన్న రేవంత్‌ దేశానికి ఆదర్శంగా నిలపాలనే ఉద్దేశంతో స్కిల్‌ వర్సిటీ రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఏడాదికి రూ.50వేలు నామ మాత్రపు ఫీజుతో కోర్సుల శిక్షణ అందించనున్నట్లు సీఎం రేవంత్ వివరించారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచితంగా అందిస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement