ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ – రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని, .. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని, ఎవరిని వదలం.. ఎవరికి అవకాశం ఇవ్వమన్నారు . ప్రజాభవన్ లో నేడు జరిగిన కాంగ్రెస్ కీలక నాయకులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ , ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు.
రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూతు, ప్రతి ఓటర్ దగ్గరకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని తమ పార్టీ నేతలకు, కార్యకర్తలు ఆయన పిలుపునిచ్చారు. తల ఎత్తుకొని … ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయండన్నారు. మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు దపాలుగా పూర్తి చేశారన్నారు.
ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన మనం రెండు లక్షల రుణమాఫీనీ నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న.. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నామన్నారు.. అయితే అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదన్నారు భట్టి. పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే అంతా ఆశ్చర్యపోయారన్నారు. . సీఎం సవాల్ ఓట్ల కోసమే.. ఎన్నికల సవాల్ అనుకున్నారు.. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. రూపాయి రూపాయి పోగుచేసి రుణమాఫీని అమలు చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని అంటూ విషయాన్ని రైతులలోకి,ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు భట్టి.