Saturday, October 19, 2024

TG – గ్రూప్ 1 అభ్య‌ర్ధుల‌తో బండి సంజ‌య్ ‘ఛలో సెక్రటేరియట్’ … అశోక్ న‌గ‌ర్ లో టెన్ష‌న్… టెన్ష‌న్

రోడ్డుపై కేంద్ర మంత్రి బైఠాయింపు
ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
బండికి త‌మ గోడును చెప్పుకున్న అభ్య‌ర్ధులు
న్యాయం కోరితే లాఠీ చార్జీలు,అరెస్ట్ లు
బండి ముందు క‌న్నీళ్లు పెట్టుకున్న మ‌హిళా అభ్య‌ర్ధులు
త‌మ‌ను న‌క్స‌లైట్ల‌గా ప్ర‌భుత్వం చూస్తుందంటూ ఆవేద‌న
12 ఏళ్లుగా గ్రూప్ 1 కోసం ఎదురు చూస్తున్నాం
జివో 29 తో త‌మ ఆశ‌ల‌పై నీళ్లు
రోడ్డుపై బైఠాయించిన కేంద్ర మంత్రి
గ్రూప్ 1 పరీక్ష‌లు వాయిదా వేయాలంటూ నినాదాలు
వారి ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన బండి
అన్ని విధాల అండ‌గా ఉంటాన‌ని హామీ
అశోక్ న‌గ‌ర్ లో టెన్ష‌న్ .. టెన్ష‌న్

హైద‌రాబాద్ – రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు అడ్డంకిగా ఉన్న 29 జీవోను ఎత్తేయాలని శాంతియుతంగా హైదరాబాద్ అశోక్ నగర్ లో ఆందోళన చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థులపై గత మూడు రోజులుగా పోలీసులు వరుసగా ఝుళిపిస్తున్న లాఠీఛార్జ్ కు నిరసగా సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగులతో కలిసి ఏకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర మంత్రికి నిరసనగా వేలాది మంది నిరుద్యోగులు, గ్రూప్ 1 అభ్యర్థులు తరలివచ్చారు. బండి సంజయ్ తో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ‘‘సీఎం డౌన్ డౌన్… 29 జీవోను రద్దు చేయాలి. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలి’’ అంటూ నినాదాలు చేశారు. రోడ్డపై బైఠాయించినంత సేపు ‘‘వ్యూ వాంట్ జస్టిస్ ’’ అంటూ నినదిస్తూనే ఉన్నారు.

మరోవైపు కేంద్ర మంత్రి రోడ్డు బైఠాయించిన విషయం తెలుసుకున్న బీజేపీ యువ మోర్చా, మహిళా మోర్చా నాయకులు, బీజేపీ కార్యకర్తలు సైతం అక్కడికి తరలివచ్చి సంజయ్ కు సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర మంత్రికి మద్దతుగా భారీగా తరలివస్తున్న నిరుద్యోగులను కట్టడి చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. అశోక్ నగర్ చుట్టుపక్కల నున్న హాస్టళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తూ.. నిరుద్యోగులను బయటకు రాకుండా అడ్డుకునేందుకు యత్నించారు. ముళ్లకంచెలు, బారికేడ్లు పెట్టి అనేక నిర్బంధాలకు గురిచేశారు. అయినప్పటికీ వాటన్నింటినీ తప్పించుకుని వేలాది మంది నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తాకు తరలివచ్చారు. బండి సంజయ్ తో కలిసి బైఠాయించారు. ‘‘వ్యూ వాంట్ జస్టిస్… రేవంత్ రెడ్డి డౌన్ డౌన్… బండి సంజయ్ జిందాబాద్’’ అంటూ నినదించారు. దీంతో అశోక్ నగర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు పోలీసులు భారీగా తరలివచ్చి అక్కడ మోహరించారు. ఒకవైపు వేలాదిగా తరలివచ్చిన నినదిస్తున్న నిరుద్యోగులు, మరోవైపు పోలీసుల మోహరింపుతో అశోక్ నగర్ చౌరస్తా వద్ద పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై బైఠాయింయిన కేంద్ర మంత్రిని కలిసేందుకు నిరుద్యోగులు క్యూ కట్టారు. పోలీసులు తమపై అన్యాయంగా లాఠీలు ఝుళిపించి గంటల తరబడి నిర్బంధించారని వాపోయారు. జీవోనెం.29 రద్దు చేసేవరకు తమకు అండగా నిలవాలని కోరారు. నిరుద్యోగుల విషయంలో నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలకులు చేసిన అన్యాయాన్ని ఏకరవు పెడుతూ వినతి పత్రాలు అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర మంత్రి వద్దకు వచ్చి అక్కడి నుండి వెళ్లిపోవాలని అభ్యర్థిస్తున్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుండి కదిలేది లేదని ససేమిరా అంటున్న బండి సంజయ్ రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య బండి సంజయ్ వేలాది మంది నిరుద్యోగులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసనను కొనసాగించడం విశేషం.

- Advertisement -

బండి ముందు కన్నీళ్లు పెట్టుకున్న అభ్యర్ధులు

అంత‌కు ముందు అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లిన బండి సంజయ్ అభ్యర్థులతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 29 ఉత్వర్వులవల్ల తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు వాపోయారు. హాస్టళ్లలో చదువుకుంటున్న మమ్ముల్ని బయటకు లాక్కొచ్చి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలమని కూడా చూడకుండా హాస్టల్ లోకి చొరబడి బట్టలు చింపేస్తున్నారని మహిళా అభ్యర్థులు కన్నీరుపెట్టుకున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే త‌మ‌పై నక్సల్స్ అని ముద్ర వేసి భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షల కోసం రాముడి వనవాసం మాదిరిగా 12 ఏళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు. తెలుగు అకాడమీ సిలబస్ కూడా చదవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోందని వాపోయారు. తమకు మీడియా నుండి సరైన సహకారం అందడం లేదని కంట నీరు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

అండ‌గా ఉంటా … బండి భ‌రోసా..

అనంత‌రం బండి మాట్లాడుతూ, గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మీ పక్షాన బీజేపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. మీరంతా ప్రశాంతంగా చదువుకోండి , మీకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. నేను కేంద్ర మంత్రినైనా మీకోసం రోడ్డెక్కుతున్నా అన్నారు. జీతాలిచ్చే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అందుకే కావాలనే ఏదో ఒక లిటిగేషన్ పెట్టి గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడేలా చేస్తోందని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా 29 జీవోను జారీ చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement