Sunday, October 20, 2024

Jammu and Kashmir | ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు మృతి !

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వలస కార్మికులు మరణించారు. గందర్‌బల్‌ జిల్లాలోని సోన్‌మార్గ్‌ ప్రాంతంలోని టన్నెల్‌ నిర్మాణ ప్రదేశంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.

మరో ఐదుగురు గాయపడ‌గా… మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభిమ‌చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement