Monday, September 30, 2024

J&K | ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రదాడి… నలుగురు జవాన్లు వీరమరణం

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దాడి సమయంలో మాచెడి-కిండ్లీ-మల్హర్‌ రహదారిపై సైనికులు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. మొదట ఆర్మీ కాన్వాయ్ పై గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదులు ఆ వెంటనే జవాన్ల వాహనంపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. కానీ అప్పటికే ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయారని అధికారులు తెలిపారు. సమాచారం అందగానే పెద్ద ఎత్తున బలగాలు అక్కడికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement