Thursday, September 19, 2024

TG | సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేత‌ల అరెస్ట్ !

సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, ఇతర బీఆర్ ఎస్ నేత‌లు సీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.

అయితే ఎమ్మెల్యేలను మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో గులాబీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీపీ లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు సిబ్బందికి ఫిర్యాదు లేఖ ఇచ్చారు.

కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంట‌నే అరెస్ట్ చేయాలని, లేదంటే కోర్టుకు వెళ్తామని… ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేయాలని హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్ రావు, బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement