Sunday, September 15, 2024

తెలుగు హీరోయిన్స్ పై చిన్న‌చూపు-ప‌ద్మ‌శ్రీ ఇవ్వ‌డానికి మేం ప‌నికిరామా – జ‌య‌సుధ‌

టాలీవుడ్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ‌. ముంబై నుంచి వచ్చే హీరోయిన్లకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని… తెలుగు హీరోయిన్లపై చిన్న చూపు ఉంటుందని చెప్పారు. పద్మశ్రీ లాంటి పురస్కారాలకు తెలుగు హీరోయిన్లయిన మేం పనికిరామా అని ప్రశ్నించారు. ముంబై నుంచి హీరోయిన్ వస్తే ఆమె కుక్కలకు కూడా స్పెషల్ రూములు ఇస్తున్నార‌న్నారు. ఎప్పుడైనా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా, ఎక్కువగా ఇబ్బంది పెట్టినా ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండనిచ్చే వారు కాదని జయసుధ తెలిపారు. హీరోల్లో డామినేషన్ ఉండదని, వారి పక్కన ఉన్న వాళ్లతోనే ఇబ్బంది అని చెప్పారు. నటిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నానని… ఇన్నేళ్లు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్ లో అయితే కనీసం ఫ్లవర్ బొకే అయినే పంపించేవారని… ఇక్కడ అది కూడా లేదని విమర్శించారు. అదే హీరో అయితే ఎక్కడా లేని హడావుడి చేసేవారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement