Wednesday, October 23, 2024

TG | ఇరాక్‌లో తెలంగాణ వాసి మృతి..

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : ఇరాక్‌లో జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన సంపంగి రాజమల్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.. కుటు-ంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. రాజమల్లు గత ఏడు సంవత్సరాల క్రితం ఇరాక్‌ దేశానికి బతుకుతెరువు కోసం వెళ్లి, అక్కడ ఓ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో గురువారం కంపెనీకి పనికి వెళ్లేటప్పుడు రోడ్డు ప్రమాదంలో రాజమల్లు చెందాడు.

ఇరాక్‌లోని రాజమల్లుతో పాటు పనిచేసే వారు ఈ సమాచారాన్ని తండ్రి పెద్ద మల్లయ్య తల్లి రాజవ్వలకు తెలిపారు. దీంతో చింతగూడ గ్రామంలో రాజమల్లు బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజమల్లు మృతితో చింతగూడ గ్రామంలో విషాదఛాయలు ఉన్నాయి. తన కుమారుని శవాన్ని త్వరగా ఇండియాకు తీసుకురావాలని పెద్ద మల్లయ్య తల్లి రాజవలు కోరుతున్నారు. అందుకు ప్రభుత్వం స్పందించాలని వారు వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement