Saturday, October 5, 2024

TG | హైడ్రా ఆర్డినెన్స్‌కు తెలంగాణ గవర్నర్ ఆమోదం..

హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్రవేశారు. ఈ మేరకు రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374(బి) సెక్షన్ చేరుస్తున్నట్లుగా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు జీహెచ్ఎంసీ అధికారాలు హైడ్రాకు అప్పగించారు. జలాశయాలు, రోడ్లు, పార్కులు, ఇతర ఆస్తులను కాపాడే బాధ్యత అధికారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఆర్డినెన్సు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement