IND vs ENG | టీమిండియా కీలక ఇన్నింగ్స్‌.. ఇంగ్లండ్ ముందు గట్టి టార్గెట్‌

టీ20 ప్ర‌పంచ క‌ప్ సెమీ ఫైనల్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇంగ్లండ్ ముందు గట్టి టార్గెట్‌ను సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు బాదింది. రోహిత్ శర్మ (57) అర్ధ శతకంతో చెలరేగి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ (47) ఆకట్టుకున్నాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (23), రవీంద్ర జడేజా (17 నాటౌట్),అక్షర్ పటేల్ (10) బౌండరీలతో మెప్పించారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 172 పరుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగనుంది.

Exit mobile version