Sunday, September 8, 2024

Delhi | ఢిల్లీలో టీడీపీ నేతల ఆందోళన.. బాబు అరెస్ట్‌పై శీర్షాసనం వేసి నిరసన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అడారి కిషోర్ పలువురు టీడీపీ కార్యకర్తలతో కలిసి గురువారం విజయ్ చౌక్ ప్రాంతంలో శీర్షాసనం వేసి నిరసన తెలిపారు. రివర్స్‌లో నడుస్తున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా రెండు వారాలుగా దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నామని కిషోర్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజల దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దుస్థితిని తీసుకెళ్లేందుకు రోజుకో రకంగా విభిన్న పద్దతుల్లో నిరసన దీక్షలు చేస్తున్నామని కిషోర్ చెప్పారు. ఆంధ్రలో రాక్షస పాలన సాగుతోందని, అధికార పార్టీ దురాగతాలకు అడ్డే లేకుండా పోతోందని ఆరోపించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి స్పందించి రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని కోరారు. విజయ్ చౌక్‌లో కిషోర్ శీర్షాసనంతో అలర్టయిన పోలీసులు అతనితో పాటు మిగిలిన టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement