Saturday, September 28, 2024

కోవిడ్ బాధితుల కోసం టీడీపీ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం తెలుగు దేశం పార్టీ ప్రత్యేకంగా ఓ క్యాంపెయిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘Hope Help’ పేరుతో కరోనా చికిత్సకు సంబంధించి ఎలాంటి సహాయం కోసమైనా తమను అడగవచ్చని టీడీపీ సూచించింది. ట్విట్టర్ ద్వారా #SOSTDP లేదా #JAITDP హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగించి మీకు, మీ బంధువులకు ఎవరికైనా సహాయం కావాలంటే ట్వీట్ చేయాలని పేర్కొంది. ఈ క్యాంపెయిన్ ద్వారా కరోనాపై అవగాహన, సమాచారం అందించడం, అవేర్‌నెస్, సహాయం వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు టీడీపీ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement