ఇంధన ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరిగింది. వాహనదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక టాటా మోటార్స్ తన సరికొత్త ఎలక్ట్రిక్ కారు అవిన్యాను ఆవిష్కరించింది. అవిన్యా పేరుతో ఈ కొత్త ఎస్యూవీ ఈవీ కారును తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ అవిన్యా ఎలక్ట్రిక్ కారు అదరగొడుతున్నది. స్మార్ట్ లుక్లో దర్మనం ఇస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 2025 నాటికి మార్కెట్లు తీసుకొస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. సరికొత్త ఫ్యూర్ ఈవీ థర్ ్డ జనరేషన్ ఆర్కిటెక్చర్ను ఆధారంగా చేసుకుని టాటా అవిన్యా రూపొందించినట్టు తెలిపింది. ఈ కారు కేవలం 30 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అవుతుంది. ఆల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యానికి సపోర్టు ఇచ్చేలా ఈ కారు బ్యాటరీ ఉంటుంది. 30 నిమిషాల చార్జింగ్కు కనీసం 500 కి.మీ దూరం వరకు ప్రయాణించగలదు.
ఈ కారుకు ఆకర్శణీయమైన ఎల్ఈడీ లైట్లు టీ ఆకారంలో ఉంటాయి. కంపెనీ ముందు వైపు పెద్ద బ్లాక్ ప్యానెల్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారును.. భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. సేఫ్టీ, సెక్యూరిటీలో ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అత్యంత శక్తివంతమైందని, ఇందులో డస్ట్ ప్రొటెక్షన్ కోసం అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ కూడా రూపొందించినట్టు తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..