Saturday, September 7, 2024

Tamilanadu – నాటు సారా దుర్ఘ‌ట‌న‌లో 55కి చేరిన మ‌ర‌ణాలు

తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా మరో అయిదుగురు చనిపోవడంతో మరణాల సంఖ్య 55కు చేరింది. ప్రస్తుతం ఇంకా 98 మందికి పైనే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీళ్లలోనూ 30 మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని భ‌య‌ప‌డుతున్నారు..

ఇక, కల్తీ సారా ఘటన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీసీఐడీకి అప్పజెప్పింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించింది. కాగా, ఈ కేసు విచారణను సీబీసీఐడీతో కాకుండా సీబీఐతో జరిపించాలని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు విచారణకు స్వీక‌రించింది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement