టీ20 వరల్డ్ కప్ నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీమిండియాకు బీసీసీఐ కార్యదర్శి జైషా రూ.125 కోట్ల క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బార్బడోస్ వేదికగా శనివారం (జూన్ 29) రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో ట్రోఫీ కరువుకు తెరదించుతూ సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఈ టోర్నీని కైవసం చేసుకోవడంతో సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement