బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 టైటిల్ పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమ్ ఇండియా బ్యాటర్లు తొలుత కాస్త తడబడ్డా.. నెమ్మదిగా కుదురుకున్నారు.. అయితే.. ఇన్నింగ్స్ ను ధాటిగా ప్రారంభించినా అదే జోరు కొనసాగించలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లు వరుసగా మూడు వికెట్లు పడగొట్టడంతో టీమ్ ఇండియా కాస్త స్లో అయ్యింది.. ఫలితంగా ఐదు ఓవర్లలోనే టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
కాగా, ప్రస్తుతం ప్రతస్తుం క్రీజ్ లో కోహ్లీ 36, అక్షర్ పటేల్ 27 తో స్కోరు బోరర్డును ముందుకు కదిలిస్తున్నారు. ఇక 10 ఓవర్లు ముగిసే సిరికి 3 వికెట్ల నష్టాకికి 75 పరుగులు సాధించింది టీమిండియా.
*రిషబ్ పంత్ తరువాత క్రీజ్ లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (3) ఐదో ఓవర్లో రబాడా బౌలింగ్ మూడో బంతికి క్యాచ్ అవుటయ్యాడు.
*ఫస్ట్ ఓవర్ నుంచే బౌండరీల మోత మోగిస్తున్న టీమిండియా రెండో ఓవర్ లో తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (9) రెండో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. కాగా, అదే ఓవర్ ఆఖరి బంతికి అప్పుడే క్రీజ్ లోకి వచ్చిర రిషబ్ పంత్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు.