బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 టైటిల్ పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. నాలుగో వికెట్ గా క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ (47)… 14వ ఓవర్లో రబడ బౌలింగ్ లో రనౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. వికెట్లు కోల్పోకుండా దక్షిణాఫ్రికా బౌలర్లు ధాటిగా ఎదురుకుంటూ అవసరమైన పరుగులు రాబట్టిన అక్షర్… కోహ్లీతో కలిసి కోహ్లీతో జతకట్టాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో నాలుగో వికెట్కు 72 పరుగులు జోడించారు.
ప్రస్తుతం ప్రతస్తుం క్రీజ్ లో కోహ్లీ 44, దూబే ఉన్నారు. ఇక 14 ఓవర్లు ముగిసే సిరికి 4 వికెట్ల నష్టాకికి 114 పరుగులు సాధించింది టీమిండియా.
*రిషబ్ పంత్ తరువాత క్రీజ్ లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (3) ఐదో ఓవర్లో రబాడా బౌలింగ్ మూడో బంతికి క్యాచ్ అవుటయ్యాడు.
*ఫస్ట్ ఓవర్ నుంచే బౌండరీల మోత మోగిస్తున్న టీమిండియా రెండో ఓవర్ లో తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (9) రెండో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. కాగా, అదే ఓవర్ ఆఖరి బంతికి అప్పుడే క్రీజ్ లోకి వచ్చిర రిషబ్ పంత్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు.