Wednesday, October 2, 2024

Swachh Bharat – చీపురు ప‌ట్టిన ప్ర‌ధాని మోదీ

న్యూ ఢిల్లీ – జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ప్రజలు సైతం పాల్గొనాలని ఈసందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2014, అక్టోబర్ 2 న ప్రధాని స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. నేటితో ఈ స్వచ్ఛ భారత్‌ మిషన్ పదేళ్లు పూర్తి చేసుకుంది.

- Advertisement -

ఈ నేప‌థ్యంలో చిన్నారులతో కలసి స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. చీపురుప‌ట్టి ప‌రిసరాల‌ను ఆయ‌న శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పరిశుభ్రతకు సంబంధించి రూ.9600 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంత‌రం ఆయ‌న విజ్ఞాన్ భవన్‌లో స్వచ్ఛతా హి సేవా 2024 కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ, ప్రజల చొరవ ‘క్లీన్ ఇండియా’ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందన్నారు. తాను, త‌ర‌యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియాన్‌లో భాగమయ్యానన్నారు. . మీరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయ‌న పిలుపు ఇచ్చారు. . ఈ చొరవ స్వచ్ఛభారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది అని పేర్కొన్నారు.

స్వ‌చ్చ అభియాన్ లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రులు

ఇక, ప్రధాని మోదీ పిలుపుమేరకు పలువురు రాజకీయ నాయకులు స్వచ్ఛ అభియాన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, రాజివ్‌రంజన్‌, ముఖేశ్‌ మాండవీయతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement