Tuesday, October 22, 2024

TG | పల్లెలన్ని జల్లెడ… మావోయిస్టు కదలికలపై నిఘా

వాజేడు, ప్రభన్యూస్ : మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో ఏజెన్సీ పల్లెలన్నీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. మావోయిస్టు కదలికలపై ప్రత్యేకంగా పెట్టిన పోలీసులు మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యావారిపేట గ్రామంలో వాహన తనిఖీలు నిర్వహించగా… అదేవిధంగా కడెకల్ గ్రామంలో కార్డెన్ చర్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ…. అపరిచిత, అనుమానిత వ్యక్తులు ఎవరైనా గ్రామ పరిసర్లలో కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా యువత గంజాయి మత్తుపదార్దాలకు దూరంగా ఉండాలని చెడు వ్యసనాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ జవాన్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement