Saturday, September 21, 2024

TG | రేపే కేసీఆర్‌ పిటిషన్ పై సుప్రీం లో విచారణ

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పవర్ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు లిస్ట్ అయింది. రేపు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. అయితే గతంలో కూడా కేసీఆర్‌ దీనిపై పిటిషన్‌ వేశారు. కానీ సుప్రీం ధర్మాసం దీన్ని తిరస్కరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement