Friday, October 18, 2024

Supreme Court -సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఆయనేనా

న్యూ ఢిల్లీ – సుప్రీంకోర్టు తదుపరి సీజేగా సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈమేరకు తన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్‌ ఖన్నా నియమితులు కానున్నారు.

నిబంధనల ప్రకారం.. ఈ ప్రతిపాదనను ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు పంపుతారు. ఆ లేఖను కేంద్ర న్యాయశాఖ.. ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు.

- Advertisement -

సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఆ లెక్కన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తర్వాత జస్టిస్‌ ఖన్నా అత్యంత సీనియర్‌గా ఉన్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పదవీకాలం ఈ ఏడాది నవంబరు 11తో ముగియనుంది. ఆ మరుసటిరోజున అంటే నవంబరు 12న జస్టిస్‌ ఖన్నా సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది మే 13న ఆయన పదవీ విరమణ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement