Monday, September 16, 2024

Supreme Court – అవి డెత్ ఛాంబ‌ర్సే…

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూఢిల్లీ : ఢిల్లీ కోచింగ్ సెంటర్ లో ముగ్గురు సివిల్ విద్యార్థుల మృతి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. కేసును సుమోటోగా స్వీకరించి విచారించిన సుప్రీం కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పింది. కోచింగ్ సెంటర్లను డెత్ ఛాంబర్స్ గా మార్చారని సీరియస్ అయ్యింది. సివిల్ సర్వీస్ విద్యార్థుల మృతితో కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించింది.

కోచింగ్ సెంటర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్సీఆర్ భద్రత చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది సుప్రీం. అన్ని భద్రతా ప్రమాణాలను పాటించిన తర్వాతే కోచింగ్‌ సంస్థకు అనుమతి ఇవ్వాలని సూచించింది. కాగా, గ‌త నెల 27న రావూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లైబ్రరీలో వరదనీరు చేరి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న తానియా సోని, శ్రేయ యాదవ్, నవీన్ డాల్విన్ లు చనిపోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement