Friday, September 6, 2024

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి.. సిబిఐ మాజీ జేడీ

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ లోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఎథికల్ కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. ఏకాగ్రతతో విద్యాభ్యాసం కొనసాగించాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కోసం కలలు కంటారని, వారి ఆశలను వమ్ము చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement